రాజేష్ ఖన్నా ప్రథాన పాత్రధారిగా రూపొందిన ఆనంద్ అనే సినిమాలో డా. భాస్కర్ బెనర్జీ అనే పాత్ర చదివే కవిత ఒకటి ఉంది. మౌత్ తూ ఏక్ కవితా హై అన్న ఈ కవిత చాలా తాత్త్వికంగా ఉంది. ప్రముఖ కవి గుల్జార్ రచించిన ఈ కవితకు నా అనువాదం ఇది. సినిమాలో డాక్టర్ పాత్రలో ధరించిన అమితాభ్ గొంతులో ఈ కవిత జీవత్వాన్ని పొంది, మరింత మార్మికతను సంతరించుకుందనడం అతిశయోక్తి కాదు. అనువాదంలో నేను కాస్త స్వేచ్ఛ తీసుకున్నా.
మరణమా నువ్వో కవితవి
మరణమా నువ్వో కవితవి
నాకో కవిత బాకీ పడ్డావు
నా కవిత నాకిస్తావుగా