Pages

Sunday, January 8, 2012

మరణమా నువ్వో కవితవి


రాజేష్ ఖన్నా ప్రథాన పాత్రధారిగా రూపొందిన ఆనంద్ అనే సినిమాలో డా. భాస్కర్ బెనర్జీ అనే పాత్ర చదివే కవిత ఒకటి ఉంది. మౌత్ తూ ఏక్ కవితా హై అన్న ఈ కవిత చాలా తాత్త్వికంగా ఉంది. ప్రముఖ కవి గుల్జార్ రచించిన ఈ కవితకు నా అనువాదం ఇది. సినిమాలో డాక్టర్ పాత్రలో ధరించిన అమితాభ్  గొంతులో ఈ కవిత జీవత్వాన్ని పొంది, మరింత మార్మికతను సంతరించుకుందనడం అతిశయోక్తి కాదు. అనువాదంలో నేను కాస్త స్వేచ్ఛ తీసుకున్నా.



మరణమా నువ్వో కవితవి

మరణమా నువ్వో కవితవి
నాకో కవిత బాకీ పడ్డావు
నా కవిత నాకిస్తావుగా


కుంగుతున్న నరాల్లో బాధ లయం పొందుతున్నప్పుడు
పాలిపోయిన చంద్రుడు క్షితిజంలో తలదాచుకుంటున్నప్పుడు
సుప్రభాతమింకా సముద్రం అంచు దాటి రానప్పుడు
వెలుగూ లేని చీకటీ కాని .
రాత్రిందివాల సంగమకాలంలో
శరీరం నశించి ఆత్మ పురుడు పోసుకున్నప్పుడు
నాకో కవిత వాగ్దానం చేశావు
నా కవిత నాకిస్తావుగా

2 comments: